top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల

vyasam@madhuravani.com

అది కథకి నా డ్యూటీ

మెడికో శ్యాం

నేనెరిగిన మునిపల్లె రాజు గారు.

నేను ఆయన గురించి ఎరిగింది స్వల్పం. అత్యంత స్వల్పం అన్నా అనవచ్చు. టిప్పాఫ్ ది ఐస్ బెర్గ్ అంటారే. అలాంటి టిప్ మాత్రమే నా జ్ఞానం. క్రిందనున్న ఆయన మంచుకొండ నాకు తెలీదు. అంత గోరంత పరిచయంలో  కొండంత అవకాశం కలిగింది. దానికి కారణం ఆయన వున్నత వ్యక్తిత్వం.

చాలామంది నన్ను తరచుగా అడిగే ( అడిగిన) ఒక ప్రశ్న : నా పుస్తకానికి ఆయన ముందు మాట ఎలా రాసేరు? అని. నా స్వభావానికి ప్రత్యేకించి తాపత్రయ పడి రాయించుకోవడం కుదరని నాకు... అంచేత నన్నెరిగిన ఏ సమకాలీ(వయస్)కుడి చేతో రెండుముక్కలు రాయించి పనికానిచ్చేద్దామనుకున్నాను.​...

భార్య...భర్త... ఓ గ్లోబల్ ఖడ్గం

డా. కరణం శ్రీనివాసులు రెడ్డి

కుటుంబం మానవ నిర్మితమైన వ్యవస్థల్లో అత్యంత ప్రాచీనమైనది. ప్రాథమికమైనది. అంతేకాదు సార్వత్రికమైనది కూడా. కుటుంబమనేది ఒక మనిషి జైవిక, మానసిక, సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక మరియు ఆధ్యాత్మిక జీవితానికి మొదటి పాటశాల. ఒక వ్యక్తి వైయక్తికత నుండి సామాజికత వైపుకు సరైన రీతిలో పరిణామం చెందే ప్రక్రియ కుటుంబం నుండే మొదలౌతుంది. మానవుడి భావి జీవితం కుటుంబం నుండే మొదటి అడుగు పడుతుంది.

 ప్రపంచంలో పటిష్టమైన కుటుంబ వ్యవస్థ కలిగిన దేశాలలో భారతదేశం ప్రముఖమైనది. వేల సంవత్సరాలుగా భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వర్ధిల్లింది. అదే వ్యక్తి వికాసానికి, సామాజిక సంబంధాలకు బలమైన పునాది వేసింది. భారతీయ కుటుంబ వ్యవస్థ లోపాలకు అతీతం కాకపోయినా,...

ఆధునికాంధ్ర సాహిత్యం - గమనం – గమ్యం

టేకుమళ్ళ వెంకటప్పయ్య

మధ్య యుగాల్లో ప్రబలిన భక్తి ఉద్యమాలు, వేమన వంటి కవుల సంఘ సంస్కరణాభిలాషల కారణంగా   తెలుగులో నవ్య కవిత్వానికి పునాదులు పడ్డాయి. ఇరవైయొవ శతాబ్దిలో గిడుగు భాషా సంస్కరణ, కందుకూరి సంఘసంస్కరణ, గురజాడ సాహిత్యసంస్కరణలు  త్రివేణీ సంగమంలా, అనంత ప్రవాహంలా సాగి..సాగి.. తెలుగు నేలలో వరదలెత్తి.. పరవళ్ళు తొక్కి.. ఆధునికాంధ్ర కవిత్వానికి నాంది పలికాయి. 1905వ సంవత్సరంలో కృష్ణా పత్రికలో అజ్ఞాతకవి చే రాయబడ్డ  "ది క్రై ఆఫ్ మదర్ ఇండియా" అనే ప్రబోధ గీతమే తెలుగులో “తొలి నవ్య కవిత”  అనే వాదన ఉంది కానీ,  అది సత్యం కాదు. అంతకు మునుపే చిలకమర్తి లక్ష్మీ నరసింహంపంతులు గారు 1895 లో రాసి గోదావరి మండల సభల్లో చదివిన 14 పద్యాలు తొలి దేశభక్తికి సంబంధించిన తొలి నవ్య రచన అని పరిశీలకులు నిగ్గు తేల్చారు...

బోయకొట్టములు పండ్రెండు చారిత్రక నవలలోని స్త్రీ పాత్రలు - విశ్లేషణ

డా. శిరీష ఈడ్పుగంటి

చరిత్రలో సాధారణంగా గెలిచిన వారి ప్రస్తావనే ఉంటుంది. కాని ఈ నవలలో గెలిచిన వారికంటే ఓడిపోయిన బోయ వీరుల ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తుంది.  బోయల వలసతోనే ఈ నవల ప్రారంభమవుతుంది.  అంతేగాకుండా వారి పేరుతోనే ఈ రచన చేయబడింది. వారి జీవనవిధానాలను, ఆచారవ్యవహారాలను, సంప్రదాయాలను, కట్టుబాట్లను, మనస్తత్వాలను, ఆనాటి సాంఘిక, ఆర్ధిక, రాజకీయపరమైన అంశాలను గూర్చి ఈనవలలో రచయిత వివరించారు. అలాగే ఈనవలలో ఆసక్తికరమైన సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి. ఏడు తరాలవారి చరిత్రను రచయిత వివరించారు. సాధారణంగా మనకు వివిధ సాహిత్య రచనలలోనూ, అలాగే సినిమాలలోనూ కూడా మూడు, నాలుగు తరాలవారి చరిత్ర కనిపిస్తుంది. అంతకుమించి ఎక్కువ కనిపించదు. కాని ఈ నవలలో ఏడు తరాలవారి చరిత్రను మనం తెలుసుకోవచ్చు...

వాషింగ్టన్ తెలుగు సాహితీ సదస్సు-ప్రసంగ వ్యాసాలు

 

మధురవాణి.కాం సంపాదకవర్గ బృందంలో ఒకరైన వంగూరి గారు తమ వంగూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ లో నిర్వహించిన "సాహితీ సదస్సు" లో వక్తల వ్యాసాలు ఒకేచోట పొందుపరుస్తున్నాము. మరిన్ని వ్యాసాలకై 'పాత సంచికలు' లోసంక్రాంతి సంచికలోని వ్యాసమధురాలు చూడగలరు.

ప్రదర్శన కళలకి సంబంధించిన సాహిత్యం

కోసూరి ఉమా భారతి

ఇక్కడ చెప్పే ప్రదర్శన కళలు నృత్యం, సంగీతం.  వాటికి సంబంధించిన సాహిత్యం ఆ కళలతో పాటుగా.. శాస్త్రీయ, జానపద, ఆధ్యాత్మక, పాశ్చాత్య రీతుల్లో... శాఖోపశాఖాలుగా విస్తరించి ఉంది..  

నాట్య రంగంలో కృషి చేసి ఉండడం వల్ల ఈ సాహిత్య సంపద గురించి తెలిసుకో గలిగాను.  

నృత్యం, సంగీతం... వంటి కళలని అభ్యసించే వారికి...వాటితో ఇమిడి ఉన్న సాహిత్యం నుండి అదనపు ప్రయోజనాలు ఉన్నాయని భావిస్తాను...తమ భాషాసాహిత్యాల పట్ల కొంత అవగాహనతో పాటు ఆసక్తి పెంపొందే  అవకాశం ఉంది.  పురాణకాలక్షేపాలకు వెళ్ళక్కరలేకుండానే రామాయణ భారత భాగవతాలోన్నుండి  కథలు, కావ్యాల గురించి తెలుసుకో గలుగుతారు.  ప్రాచీన సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారవ్యవహారాలని అర్ధం చేసుకోగలుగుతారు.  పురాణాలలోని ఉన్నతమైన స్త్రీపురుషుల వ్యక్తిత్వాలను పరిశీలించ గలుగుతారు....

bottom of page